అధిక ఫీజుల వసూలు.. శ్రీచైతన్య స్కూల్ సీజ్

Published : Jun 25, 2020, 09:38 AM IST
అధిక ఫీజుల వసూలు.. శ్రీచైతన్య స్కూల్ సీజ్

సారాంశం

పాఠశాలలో పుస్తకాలు, అడ్మిషన్లు కోసం ఫీజులు వసూలు చేస్తుండడంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి విషయాన్ని మండల విద్యాధికారి బాబూ సింగ్‌కు తెలియజేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలను బుధవారం విద్యాధికారి సీజ్‌ చేశారు. పాఠశాలలో పుస్తకాలు, అడ్మిషన్లు కోసం ఫీజులు వసూలు చేస్తుండడంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి విషయాన్ని మండల విద్యాధికారి బాబూ సింగ్‌కు తెలియజేశారు.

 ఎంఈవో పాఠశాలను తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సతీష్‌ మాట్లాడుతూ,  ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతనే పాఠశాలలు తెరవాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన్‌ కార్యదర్శి అక్బర్‌, నాయకులు సుభాష్‌ పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల: బాలికలదే హవా.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?
తెలంగాణ ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ వ‌చ్చేశాయ్‌.. వాట్సాప్‌లో అంద‌రికంటే ముందే తెలుసుకోండి