కేసులకు భయపడ : స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ ప్రశాంత్ (వీడియో)

Published : Apr 03, 2018, 06:32 PM IST
కేసులకు భయపడ : స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ ప్రశాంత్ (వీడియో)

సారాంశం

మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు

తెలంగాణలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ ను గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఫేస్ బుక్ లోని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న ప్రశాంత్ పై కొందరు ఫిర్యాదు చేశారు.

సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ప్రశాంత్ బానిసలు అని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ లో పోస్టులు చేసినట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని గంటల కొద్దీ విచారించారు. సోమవారం విచారణ జరిపి రాత్రి 11 గంటలకు వదిలేశారు. తర్వాత మంగళవారం కూడా విచారణ చేపట్టారు పోలీసులు.

అయితే తనపై కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ప్రశాంత్ తేల్చి చెప్పారు. తన పోస్టుల్లో తప్పులుంటే చర్యలు తీసుకోవచ్చన్నారు. అయితే అన్ని ఎవిడెన్స్ తోనే తాను పోస్టులు పెట్టానని, తనపై ఏరకమైన కేసులు నమోదు చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండోరోజు విచారణకు వెళ్తున్న సందర్భంలో ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ ఏమన్నారో పైన వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu
Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?