Ugadi 2022 : ఉగాదికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

Published : Mar 31, 2022, 09:59 AM ISTUpdated : Mar 31, 2022, 10:03 AM IST
Ugadi 2022 : ఉగాదికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

సారాంశం

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి షెడ్యుళ్లు కూడా రైల్వే శాఖ ప్రకటించింది.

హైదరాబాద్ : ఉగాదికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు వీటిని నడపనుంది. కాకినాడ-సికింద్రాబాద్ (07593)31న రాతి 8.45కి, సికింద్రాబాద్ -కాకినాడ (07594) 1న రాత్రి 8.45గంటలకు , కాకినాడ-తిరుపతి (07595) 2న రాత్రి 9.00 గంటలకు, తిరుపతి-సికింద్రాబాద్ (07596)3న రాత్రి 7.50కి బయలుదేరుతాయి. గుంటూరు-హుబ్లీ (07591) 3న సాయంత్రం 4.30గంటలకు , హుబ్లీ-గుంటూరు (07592) 4న ఉదయం 9.25కి, కికింద్రాబాద్ -తిరుపతి (07597)1న రాత్రి 8.15కి, తిరుపతి-కాకినాడ్ (07598)2న రాత్రి 9.55 గంటలకు, కాకినాడ టౌన్-వికారాబాద్ (07599) 3న రాత్రి 8.45కు, మచిలీపట్నం-తిరుపతి (07095)1న సాయంత్రం 6.25 గంటలకు, తిరుపతి-మచిలీపట్నం (07096) 2న రాత్రి 10.15 గంటలకు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

కాగా, సికింద్రాబాద్- మహబూబ్ నగర్ల మధ్య రైల్వే డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పేర్తయ్యాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఉందానగర్-గొల్లపల్లి నడుమ విద్యుదీకరించిన లైన్లు కూడా వినియోగంలోకి వచ్చాయన్నారు. డబ్లింగ్ పూర్తితో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు మెరుగుపడతాయన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?