రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

Published : Oct 27, 2018, 02:10 PM ISTUpdated : Oct 27, 2018, 03:53 PM IST
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

సారాంశం

శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కన్నుమూసింది.

హైదరాబాద్ నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కన్నుమూసింది. గచ్చిబౌలిలో ఈ ప్రమాదం జరగగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సెలవు రోజుకావడంతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, ప్రవీణ్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై చిలుకూరి బాలాజీ ఆలయానికి బయలుదేరారు. అయితే గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా వద్ద ఓ లారీ వీరి వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.

                                                      

                                                      

                                                     

                                                     

 

PREV
click me!

Recommended Stories

Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే