సిద్ధిపేట పోలీసు ఏం చేశాడో తెలుసా ? (వీడియో)

Published : Jul 03, 2017, 02:10 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
సిద్ధిపేట పోలీసు ఏం చేశాడో తెలుసా ? (వీడియో)

సారాంశం

అంగవైకల్యం ఉన్నవారిని చేస్తే ఎవరైనా అయ్యో పాపం అంటారు. కానీ అలాంటి వారి మీద దాడి చేయాలని అనుకోరు. ఎంతటి కర్కష మనిషి అయినా వారి మీద దాడి చేసి కొట్టాలనుకోరు. కానీ ఈ పోలీసు మాత్రం అలా కాదు.  సిద్ధిపేట జిల్లా లోని మిరుదొడ్డి ఎస్సై సతీష్ ఏం చేశాడో తెలిస్తే ఎవరూ తట్టుకోలేరు.  అంగవైకల్యం ఉన్న ఓ వ్యక్తిని దుర్భాషలాడుతూ చితకబాదిండు. కానిస్టేబుల్ ను పురమాయించి కొట్టించాడు.

 

మిరుదొడ్డిలోని కనకరాజ్ చెరువు కాలువ ధ్వంసం చేసిన విషయంలో ఆ గ్రామ రైతులు నర్సింహ్మారెడ్డి, కొమురయ్య యాదవ్ అనే వ్యక్తుల మద్య వివాదం నెలకొంది. దీనిపై గ్రామ పెద్దలు పంచాయతీ చేసి తీర్పు చెప్పారు. తీర్పు నర్సింహ్మారెడ్డికి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఈ పంచాయితీని పోలీసు స్టేషన్ కు తీసుకుపోయిండు నర్సింహ్మారెడ్డి.

 

ఇక ఈ పంచాయితీ విషయంలో నర్సింహ్మారెడ్డికి వకాల్తా పుచ్చుకున్న ఎస్సై సతీష్ పలుమార్లు స్టేషన్ కు రావాలంటూ కొమురయ్య యాదవ్ ను పిలిచాడు. కానీ కొమురయ్య రాలేదు. తీరా వత్తిడి పెరగడంతో ఆదివారం స్టేసన్ కు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఎన్నిసార్లు పిలిచినా ఎందుకు స్టేషన్ రాలేదు అంటూ ఎస్సై కొమురయ్యను దుర్భాషలాడారు. అయితే తన తప్పేమీ లేదని కొమురయ్య సమాధానమిచ్చాడు.

 

కానీ ఇంతలోనే కల్పించుకున్న కానిస్టేబుల్ నాగిరడ్డి... ఎన్నిసార్లు పిలిచినా రావా నీకు అంత బలుపా? పెద్ద సారు చెప్పినా ఎందుకు రాలేదంటూ దివ్యాంగుడైన కొమరయ్య యాదవ్ పై దాడిచేశాడు. అది చాలదన్నట్లు ఎస్సై కూడా కొమురయ్యను చితకబాదాడు. వికలాంగుడిని పట్టుకుని ఎందుకు కొడుతున్నారని కొమురయ్య బాబాయి మల్లేషం వారిస్తుంటే నువ్వేందిరా చెప్పేది అంటూ ఆయనను సైతం చితకబాదాడు ఎస్సై సతీష్. దీనిపై సిద్ధిపేట అంతటా ఆందోళన జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu