
హైదరాబాద్ : టపచబుత్ర లో ఎస్సై గా పని చేస్తున్న మధు తనను మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మధు తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బేగంపేట పోలీసుతో పాటు టపచబుత్ర, పశ్చిమ మండల డిసిపికి బాధితురాలు ఫిర్యాదు చేసింది.
గతంలో వివాహం అయిన ఎస్సై మధు బాదితురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఈ నెల 15న సిపి అంజనీ కుమార్ ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.