భయపెట్టి.. ఏడాదిగా బాలుడిపై మరో ముగ్గురు బాలురు అత్యాచారం

Published : Sep 01, 2019, 12:41 PM IST
భయపెట్టి.. ఏడాదిగా బాలుడిపై మరో ముగ్గురు బాలురు అత్యాచారం

సారాంశం

చాంద్రాయణగుట్ట భవానీనగర్ పరిధిలో నివసించే ఓ బాలుడు స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూలులో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్ధులు అతడిపై ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బాలుడిపై మరో ముగ్గురు బాలురు ఏడాదికాలంగా లైంగిక దాడికి  పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట భవానీనగర్ పరిధిలో నివసించే ఓ బాలుడు స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

అదే స్కూలులో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్ధులు అతడిపై ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు.

అయితే ఇటీవల బాధితుడి తండ్రి పాఠశాలకు రాగా.. అతను నీరసంగా కనిపించాడు. ఏమైందని ఆరా తీయగా బాలుడు అసలు విషయం చెప్పాడు. వెంటనే బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?