బోరు బావిలో కలిసిన యూరియా: పలువురికి అస్వస్థత, 5 పశువులు మృతి

Siva Kodati |  
Published : Jun 16, 2019, 04:21 PM ISTUpdated : Jun 16, 2019, 04:22 PM IST
బోరు బావిలో కలిసిన యూరియా: పలువురికి అస్వస్థత, 5 పశువులు మృతి

సారాంశం

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. అదే నీరు తాగిన ఐదు పశువులు సైతం చనిపోయాయి.

గొల్ల కుమార్ అనే వ్యక్తి పోలంలో మోటారు గత కొంతకాలంగా పనిచేయడం లేదు. దీనిని రిపేర్ చేయించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పైకి రాకపోవడంతో.. యూరియా గుళికలను దానిలో వేశాడు.

ఇలా వేస్తే మోటారు వదులుగా మారి పైకి వస్తుందని అతను భావించాడు. యూరియా వేశాక మోటారు పైకి వచ్చింది. మరమ్మత్తుల అనంతరం దానిని తిరిగి లోపలికి దించారు. ఈ క్రమంలో కుమార్ తాను కొత్తగా కడుతున్న ఇంటి నిర్మాణానికి నీరు అవసరమై.. అదే బోరు నుంచి నీటిని డ్రమ్ముల్లో తరలించాడు.

ఈ క్రమంలో పశువులు, కొందరు స్థానికులు ఆ నీటిని తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని నారాయణ్ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం