మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. అదే నీరు తాగిన ఐదు పశువులు సైతం చనిపోయాయి.
గొల్ల కుమార్ అనే వ్యక్తి పోలంలో మోటారు గత కొంతకాలంగా పనిచేయడం లేదు. దీనిని రిపేర్ చేయించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పైకి రాకపోవడంతో.. యూరియా గుళికలను దానిలో వేశాడు.
ఇలా వేస్తే మోటారు వదులుగా మారి పైకి వస్తుందని అతను భావించాడు. యూరియా వేశాక మోటారు పైకి వచ్చింది. మరమ్మత్తుల అనంతరం దానిని తిరిగి లోపలికి దించారు. ఈ క్రమంలో కుమార్ తాను కొత్తగా కడుతున్న ఇంటి నిర్మాణానికి నీరు అవసరమై.. అదే బోరు నుంచి నీటిని డ్రమ్ముల్లో తరలించాడు.
ఈ క్రమంలో పశువులు, కొందరు స్థానికులు ఆ నీటిని తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని నారాయణ్ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.