కరోనాను కట్టడి ఎలాగంటే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

Arun Kumar P   | Asianet News
Published : Jul 13, 2020, 11:16 AM ISTUpdated : Jul 13, 2020, 11:24 AM IST
కరోనాను కట్టడి ఎలాగంటే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

సారాంశం

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. 

కరోనా కారణంగా బోనాల పండగను ఘనంగా నిర్వహించలేకపోయామని...ఈ కరోనా ఎలా కట్టడి అవుతుందో చెప్పాలంటూ భక్తులు కోరారు. అయితే ఎవరు చేసుకున్నది వారే అనుభవించాలని... మీరు చేసుకున్నదే ఇదంతా అని ఆమె తెలిపారు. కానీ సరైన సమయంలో కరోనాను కట్టడి చేయడానికి తాను వున్నానంటూ స్వర్ణలత రంగం వినిపించారు.  

మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి.. అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుని రాబోయే రోజుల్లో జరగబోయే విషయాలను చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఈ ఏడాది కూడా మహంకాళి బోనాలు ముగిసిన తర్వాతి రోజు అంటే ఇవాళ ఆమె రంగం వినిపించారు. కరోనా  కట్టడి చేయడానికి తాను వున్నానంటూ భక్తులకు అభయమిచ్చారు.  
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం