సంగారెడ్డి పాప మిస్సింగ్... ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంపర్ ఆఫర్

By telugu teamFirst Published May 9, 2019, 12:17 PM IST
Highlights

మూడు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ పసికందు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. మూడు రోజులౌతున్నా పాప ఆచూకీ మాత్రం లభించలేదు.  

మూడు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ పసికందు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. మూడు రోజులౌతున్నా పాప ఆచూకీ మాత్రం లభించలేదు.  సీసీటీవీ ఫుటేజీ ఉన్నా కూడా.. పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు.  కాగా.. గురువారం పాప తల్లిదండ్రులను ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. పాప దొరకాలన్నదే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. తప్పొప్పుల లెక్కింపు తర్వాత అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. జిల్లా ఆసుపత్రిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరనున్నట్టు తెలిపారు. పాపను అప్పగించిన వారికి రూ.2లక్షల నగదు ఇస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 

click me!