జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి: ఎస్ఐ సహా నలుగురికి గాయాలు

Published : Jul 27, 2021, 09:45 AM IST
జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి: ఎస్ఐ సహా నలుగురికి గాయాలు

సారాంశం

జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా పోలీసులపై దాడికి దిగింది. ఈ దాడిలో ఎస్ఐ సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.   

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా పోలీసులపై దాడికి దిగింది. ఈ ఘటనలో మల్లాపూర్ ట్రైనీ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అక్రమార్కులు నిబంధనలకు విరుద్దంగా జేసీబీల సహాయంతో ఇసుకను రాత్రిపూట తరలిస్తున్నారనే విషయమై తెలుసుకొన్న ఎస్ఐ  ముగ్గురు కానిస్టేబుళ్లు ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొన్నారు. అయితే పోలీసులను గుర్తించిన ఇసక మాఫియా దాడికి దిగింది.,

పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా అక్కడి నుండి పారిపోయారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ గౌస్ బాబా సందర్శించారు. గాయపడిన ఎస్ఐ , ముగ్గురు కానిస్టేబుళ్లను ఆసుపత్రి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్