శంషాబాద్ రోడ్డు ప్రమాదం: మద్యం సేవించిన కారు నడపడం వల్లే...

Published : Apr 19, 2021, 10:29 AM IST
శంషాబాద్ రోడ్డు ప్రమాదం: మద్యం సేవించిన కారు నడపడం వల్లే...

సారాంశం

శంషాబాద్ లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. లారీ బోల్తా పడడానికి కారు డ్రైవర్ మద్యం సేవించి ఉండడమే కారణమని పోలీసులు నిర్దారించారు.

శంషాబాద్: శంషాబాద్ రోడ్డు ప్రమాదానికి కారు డ్రైవర్ కారణమని పోలీసులు తేల్చారు. శంషాబాద్ లో కారు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

డ్రైవర్ మద్యం సేవించి నడుపుతూ లారీకి ఎదురుగా కారును తీసుకుని వెళ్లాడని, కారును తప్పించడానికి లారీ డ్రైవర్ ప్రయత్నించాడని, దాంతో లారీ పల్టీ కొట్టి ఆరుగురు మరణించారని పోలీసులు అంటున్నారు. కారు శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతులంతా వలస కూలీలని భావిస్తున్నారు. ఆరుగురు మరణించగా 15 మందిదాకా గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

శంషాబాద్ నుంచి కూరగాయలు తీసుకుని వెళ్తున్న క్రమలో ఆ ప్రమందా సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు లారీలో దాదాపు 30 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?