నల్లగొండ జిల్లాలో దారుణం: నిద్రలోనే దంపతుల హత్య, రక్తం మడుగులో శవాలు

Published : Apr 19, 2021, 08:14 AM ISTUpdated : Apr 19, 2021, 08:21 AM IST
నల్లగొండ జిల్లాలో దారుణం: నిద్రలోనే దంపతుల హత్య, రక్తం మడుగులో శవాలు

సారాంశం

నల్లగొండ జిల్లాలో భార్యాభర్తలు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆరు బయట నిద్రిస్తున్న దంపతులు హత్యకు గురయ్యారు. భార్యాభర్తలు రక్తంమడుగులో పడి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం. ఇచ్చారు.

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. నిద్రలోనే వారిని హత్య చేశారు. ఉదయంపూట రక్తం మడుగులో శవాలు పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేసవి కాలం కావడంతో దంపతులు ఆరు బయట నిద్రిస్తున్నారు. వారు హత్యకు గురయ్యారు. 

వారిని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే విషయాలు తెలియలేదు. పోలీసులు కారణం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నేరేడుగొండ మండలంలోని బుగ్గ తండాలో ఈ జంట హత్యలు జరిగాయి.

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu