ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరి మృతి

By Siva KodatiFirst Published Feb 11, 2019, 9:05 AM IST
Highlights

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలటం ముత్యాలమ్మగూడెం వద్ద ముందు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్‌ను బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్.. బస్సుకు, లారీకి మధ్యలో ఇరుక్కుని చనిపోగా, ప్రయాణికుల్లో ఓ మహిళ అక్కడికక్కడే మరణిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 15 మంది క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

click me!