దండు మల్కాపురం వద్ద డీసీఎం వ్యానులో మంటలు:రూ. కోటి విలువైన వస్తువులు దగ్ధం

Published : Nov 08, 2022, 09:40 AM ISTUpdated : Nov 08, 2022, 10:00 AM IST
దండు మల్కాపురం వద్ద డీసీఎం వ్యానులో  మంటలు:రూ. కోటి విలువైన వస్తువులు దగ్ధం

సారాంశం

చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం వద్ద డీసీఎం వ్యాన్ లో మంటలు  వ్యాపించాయి. అమెజాన్ పార్శిల్స్ ను తీసుకెళ్తున్న వ్యాన్ లో మంటలు వ్యాపించాయి.

చౌటుప్పల్:మండలంలోని దండుమల్కాపురం వద్ద డీసీఎం వ్యాన్ లో  మంగళవారంనాడు మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న వస్తువులు  అగ్నికి ఆహుతయ్యాయి.అమెజాన్ పార్శిల్స్ ఉన్న  డీసీఎం వ్యాన్ లో  అగ్ని  ప్రమాదం చోటుచేసుకుంది.ఈ  ప్రమాదం కారణంగా డీసీఎం వ్యాన్  లో ఉన్నసుమారు  కోటి రూపాయాల విలువైన వస్తువులు  అగ్నికి ఆహుతయ్యాయి.  అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని  వాహన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికిసమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు వచ్చిమంటలను ఆర్పాయి., హైద్రాబాద్ -విజయవాడ హైవేపై   ఈ  ప్రమాదం చోటు చేసుకుంది.హైద్రాబాద్ నుండి  విజయవాడ వైపునకు ఈ డీసీఎం వ్యాన్ వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటుచేసుకుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?