హైదరాబాద్ పోలీసులనే దోచేసిన ఘరానా దొంగలు

Published : Aug 06, 2018, 01:38 PM ISTUpdated : Aug 06, 2018, 01:39 PM IST
హైదరాబాద్ పోలీసులనే దోచేసిన ఘరానా దొంగలు

సారాంశం

రాత్రి వేళల్లో దొంగలు, అసాంఘిక శక్తుల నుండి ప్రజలను కాపాడటానికి పోలీసులు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే అలా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులనే కొందరు ఘరానా దొంగలు దోచేశారు. పోలీసుల కారులోనుండే ఓ విలువైన ట్యాబ్ ను ఎత్తుకెళ్లారు.

రాత్రి వేళల్లో దొంగలు, అసాంఘిక శక్తుల నుండి ప్రజలను కాపాడటానికి పోలీసులు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే అలా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులనే కొందరు ఘరానా దొంగలు దోచేశారు. పోలీసుల కారులోనుండే ఓ విలువైన ట్యాబ్ ను ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో ఆదివారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏదో గొడవ జరుగుతున్న సమాచారం రావడంతో పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి వెళ్లారు.  అక్కడ గొడవపడుతున్న వారిని సముదాయించి, ఈ గొడవ కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇందుకోసం పోలీసులు కాస్సేపు తమ వాహనాన్ని దూరంగా పార్క్ చేశారు.

దీన్ని అదునుగా భావించిన కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ వాహనంలోని సామ్ సంగ్ ట్యాబ్లెట్ ను దొంగిలించారు. వాహనంలోకి చేరుకున్న సిబ్బందికి ట్యాబ్  కనిపించకపోయేసరికి జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu