శుభకార్యానికి వెళ్లివస్తుండగా ప్రమాదం...ముగ్గురు మృతి

By Arun Kumar PFirst Published Feb 16, 2019, 8:02 AM IST
Highlights

హైదరాబాద్ శివారులోని శామీర్ పేట పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి విందుకు వెళ్లివస్తున్న ఓ డిసిఎం వ్యానును మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాందంలొ ముగ్గురు వ్యక్తులు  అక్కడికక్కడే మృతిచెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 
 

హైదరాబాద్ శివారులోని శామీర్ పేట పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి విందుకు వెళ్లివస్తున్న ఓ డిసిఎం వ్యానును మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాందంలొ ముగ్గురు వ్యక్తులు  అక్కడికక్కడే మృతిచెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ సూరారం కాలనీకి చెందిన కొందరు ఓ పెళ్లి విందు కోసం గురువారం రాత్రి డిసీఎం వ్యానులో బయలుదేరారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున తిరుగుప్రయాణయ్యారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తూ తుర్కపల్లి ప్రాంతంలోకి రాగానే డీసిఎం వ్యానును ఓ లారీ వేగంగా వచ్చి డీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో రాజు(30), ఎర్ర శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. పాల్(24) అనే మరో యువకుడు ఆస్పత్రికి చికిత్సపొందుతూ  మృతిచెందాడు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.    
    

click me!