దైవదర్శనానికి వెళుతుంటే రోడ్డు ప్రమాదం... ఐదుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 23, 2021, 09:37 AM ISTUpdated : Aug 23, 2021, 09:42 AM IST
దైవదర్శనానికి వెళుతుంటే రోడ్డు ప్రమాదం... ఐదుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం (వీడియో)

సారాంశం

వేములవాడ రాజన్న దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగ్గా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 

కరీంనగర్: శ్రావణ సోమవారం పర్వదినాన వేములవాడ రాజన్న దర్శించుకుందామని వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహిళలు, చిన్నారులతో వెళుతున్న ఆటో ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఐదుగురికి తీవ్ర  గాయాలవగా ఇద్దరి  పరిస్థితి విషమంగా వుంది. 

వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా పాలకుర్తి, ఇందిరానగర్ కు చెందిన కొందరు ఆదివారం రాత్రి వేములవాడకు బయలుదేరారు. శ్రావణ సోమవారం సందర్భంగా రాజన్నను దర్శనం కోసం ఒకరోజు ముందుగానే బయలుదేరారు. మహిళలు, చిన్నారులు ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది. 

వీడియో

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామశివారులో రాత్రి 11 గంటల సమయంలో ఆటో ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న, చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.  

ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలవగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్షతగాత్రుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్