
కామారెడ్డి : kamareddy జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి వద్ద సోమవారం రాత్రి ఘోర road accident జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కు, పద్మాజివాడి x రోడ్ వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
మృతి చెందిన వారు లింగంపేట మండలం కొండాపూర్ కు చెందిన చోటే మియా ( 50), నిజాంసాగర్ మండలం అచ్చంపేటకు చెందిన కౌరున్ (45), హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సారిక్ (70)గా గుర్తించారు. గాంధారి మండలం సీతాయిపల్లి లో అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా, మార్చి 5న ములుగు జిల్లాలోనూ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే జరిగింది. Mulugu జిల్లా ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర road accident జరిగింది. ఆటోను ఢీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్గరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల్లో, స్వగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను warangal MGMకు తరలించారు. మృతి చెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటోడ్రైవర్ జానీ(23)గా గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలో మార్చి 1న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిదిమంది వలసకూలీలు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి రోడ్డుమధ్యలో వుండే డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు బ్రతుకుదెరువు కోసం తెలంగాణకు వసలవచ్చారు. వీరు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటే కుటుంబాలను పోషించుకునేవారు.
అయితే వీరిలో కొందరు రామాయంపేటలో పని వుండటంతో ఇటీవలే అక్కడికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు నగర శివారులోని మేడ్చల్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. డ్రైవర్ మద్యంమత్తులో కారు నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారు మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి బావర్చి హోటల్ ఎదురుగా డివైడర్ కు డీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో తొమ్మిదిమంది వుండగా తీవ్రంగా గాయపడి గోరీ సింగ్, బబ్లీ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఏడుగురికి కూడా తీవ్రగాయాలపాలయ్యారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం రెండు మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.