తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను తెలంగాణ ఉద్యమ వీరుడు అని కొనియాడారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. శాసనసభ మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యమకారుడైన స్వామి గౌడ్ కు మంత్రి పదవి ఇవ్వకుండా ఉద్యమ ద్రోహికి మంత్రి పదవి ఇచ్చారని కేసిఆర్ పై విమర్శలు కురిపించారు రేవంత్ రెడ్డి. స్వామి గౌడ్ గురించి ఇంకా ఏమన్నారో కింద వీడియోలో చూడండి.
అసెంబ్లీ మీడియా పాయింట్ లో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, స్వామి గౌడ్ కంటికి గాయాలపైనా రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. గవర్నర్ ఆధీనంలో సభ ఉన్నప్పుడు స్పీకర్ ఎలా యాక్షన్ తీసుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. రేవంత్ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఫుల్ వీడియో కింద ఉంది చూడండి.