మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు.
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన బాలానగర్ మండలం తిరుమలగిరిలో చోటుచేసుకుంది. బాలికపై మరో యువకుడితో కలిసి ఆమె బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరు కలిసి బాలికను హత్య చేశారు. తర్వాత బాలిక ఉరివేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది.