కత్తులతో బెదిరించి... గోదావరిఖనిలో యువతిపై అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Mar 02, 2021, 10:00 AM IST
కత్తులతో బెదిరించి... గోదావరిఖనిలో యువతిపై అత్యాచారయత్నం

సారాంశం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కొందరు కామాంధులు కత్తులతో బెదిరించి ఓ యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. 

పెద్దపల్లి: ఒంటరిగా వెళుతున్న యువతిని వెంబడించి కత్తులతో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. కామాంధుల నుండి యువతిని కాపాడిన స్థానికులు దేహశుద్ది చేశారు. 

వివరాల్లోకి వెళితే... గోదావరి ఖని ఇంక్లైన్ గడ్డ వద్ద ఓ యువతి ఒంటరిగా వుండటాన్ని కొందరు ఆకతాయిలు గుర్తించారు. దీంతో కత్తులతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనతో బెదిరిపోయిన యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన యువకులను పట్టుకుని దేహశుద్ది చేశారు.  స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే