కరోనా బాధిత యువతిపై... క్వారంటైన్ కేంద్ర సిబ్బంది అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Sep 13, 2020, 08:01 AM ISTUpdated : Sep 13, 2020, 08:32 AM IST
కరోనా బాధిత యువతిపై... క్వారంటైన్ కేంద్ర సిబ్బంది అత్యాచారయత్నం

సారాంశం

కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం చేరిన ఓ యువతిపై హాస్పిటల్ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం చేరిన ఓ యువతిపై హాస్పిటల్ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వళితే.. రెండు వారాల క్రితం నాంపల్లికి చెందిన ఓ యువతికి కరోనా సోకగా చికిత్స కోసం ఎర్రగడ్డ ఆయుర్వేదిక హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో చేరింది. అయితే అదే హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి కిరణ్ కన్న ఆ యువతిపై పడింది. ఇందులోబాగంగానే యువతితో పరిచయాన్ని పెంచుకుని ఆమెకు సాయం చేస్తున్నట్లు నటించాడు. 

read more  అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం... చికిత్స పొందుతూ బాధితుడి మృతి

ఈ క్రమంలోనే ఓరోజు అర్ధరాత్రి యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, వెలికిగా మాట్లాడటం చేశాడు. దీంతో బాధిత యువతి అతడిపై డ్యూటీ డాక్టర్ కు ఫిర్యాదు చేసింది. అతడు యువతిని ఓదార్చి ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లగా అతడు పట్టించుకోకపోగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.  

అయితే బాధిత యువతి ఇటీవల కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకుంది. తనపై హాస్పిటల్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన  విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఈ విషయం ఆలస్యంగా అయినా వెలుగులోకి వచ్చింది. కిరణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయని... గతంలోనూ పలువురిని లైంగిక వేధించినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. 

  

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu