చోరీకి వెళ్లి సజీవ దహనమైన దొంగ: అసలేం జరిగింది..?

By Siva KodatiFirst Published Sep 12, 2020, 9:14 PM IST
Highlights

చోరికి వెళ్లిన దొంగ అక్కడే చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ కిరాణా షాపుకు చోరీకి వెళ్లిన దొంగ.. దుకాణంలో చీకటిగా ఉండటంతో అగ్గిపుల్ల వెలిగించాడు.

చోరికి వెళ్లిన దొంగ అక్కడే చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ కిరాణా షాపుకు చోరీకి వెళ్లిన దొంగ.. దుకాణంలో చీకటిగా ఉండటంతో అగ్గిపుల్ల వెలిగించాడు.

అది కాస్తా ప్రమాదవశాత్తూ పెట్రోల్, శానిటైజర్ బాటిళ్లపై పడి మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకోవడానికి ఆస్కారం లేక ఆ మంటల్లోనే దొంగ మృతి చెందాడు.

యజమాని దుకాణం తెరవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ మండలం పాల్వంచలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

click me!