నిర్మల్ జిల్లాలో దారుణం.. అర్ధరాత్రి నడిరోడ్డుపై గర్భిణీ ప్రసవం..

Published : Aug 25, 2023, 07:09 AM IST
నిర్మల్ జిల్లాలో దారుణం.. అర్ధరాత్రి నడిరోడ్డుపై గర్భిణీ ప్రసవం..

సారాంశం

రోడ్డు సరిగా లేదని అంబులెన్స్ రాకపోవడంతో ఓ ఆదివాసీ మహిళ నడిరోడ్డుమీదే ప్రసవించింది. 

నిర్మల్ జిల్లా : కనీస వైద్య సదుపాయాలు లేక ఆదివాసీలు పడుతున్న అవస్థలకు మరో ఘటన అద్దం పడుతోంది. నిర్మల్ జిల్లాలో ఓ ఆదివాసీ మహిళ అర్ధరాత్రి నడిరోడ్డుపై గర్భిణీ ప్రసవించింది. నిర్మల్ జిల్లా, పెంగ్డి మండలంలోని తులసిపేటతులసిపేటలో ఉంటున్న సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే రోడ్డు సరిగా లేకపోవడంతో తులసిపేటకు అంబులెన్స్ రాలేదు. 

గర్భిణిని బంధువులు ఎడ్ల బండిలో కడెంవాగు దాటించారు. ఆ తరువాత వాగువొడ్డునే ఆదివాసీ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి పురిటినొప్పులతో నాలుగు గంటల పాటు నరకయాతన పడింది. పసుపుల వద్ద నొప్పులు ఎక్కువయ్యాయి. ఆ తరువాత అంబులెన్స్ లో స్థానికి పీహెచ్ సీకి తరలించారు. గతంలో పసుపుల వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో వాగు అవతల ఉన్న ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం