వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్‌ఐ దుర్మరణం..

Published : Jun 18, 2023, 05:04 PM IST
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్‌ఐ దుర్మరణం..

సారాంశం

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) మృతిచెందారు.

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) మృతిచెందారు. ఎస్‌ఐ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.  కుమారస్వామి ఆదివారం రోజున కొత్తగూడెం నుంచి వరంగల్‌కు వస్తుండగా.. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి మృతిచెందారు. 

అయితే ప్రమాదానికి గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుమారస్వామి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమారస్వామి మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu