
వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) మృతిచెందారు. ఎస్ఐ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. కుమారస్వామి ఆదివారం రోజున కొత్తగూడెం నుంచి వరంగల్కు వస్తుండగా.. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి మృతిచెందారు.
అయితే ప్రమాదానికి గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుమారస్వామి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమారస్వామి మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.