బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

Published : Sep 14, 2022, 05:11 PM IST
బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

సారాంశం

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ మన్సూరాబాద్ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలని పోస్టులు పెట్టాడనే ఆరోపణలపై ఎల్‌బీ నగర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ మన్సూరాబాద్ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై పోలీసులు కేసు నమోదైంది. బీజేపీకి చెందిన నర్సింహారెడ్డి.. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలని పోస్టులు పెట్టాడనే ఆరోపణలపై ఎల్‌బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో బెంగాల్‌లో విధ్వంసం వీడియోలకు  నర్సింహారెడ్డి రిప్లై‌లు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విధ్వంసాలను ప్రేరేపించారని అభియోగాలపై ఐపీసీ సెక్షన్‌లు 163ఏ, 502, 505(2), 506, 153, 189 కింద కేసులు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu