సస్పెన్షన్ కు గురైన ఎఎస్ఐ మోహన్ రెడ్డిపై వేటు: సర్వీస్ నుండి తొలగింపు

Published : Dec 01, 2022, 08:48 PM IST
సస్పెన్షన్ కు గురైన ఎఎస్ఐ  మోహన్ రెడ్డిపై వేటు: సర్వీస్ నుండి తొలగింపు

సారాంశం

ఎఎస్ఐ మోహన్ రెడ్డిని సర్వీస్ నుండి పోలీస్ శాఖ తొలగించింది.  ఈ మేరకు పోలీస్ శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.  అధిక వడ్డీల పేరుతో  పలువురిని మోసం చేశారని మోహన్  రెడ్డిపై  కేసు నమోదైన విషయం తెలిసిందే. 

కరీంనగర్: సస్పెన్షన్ కు గురైన ఎఎస్ఐ మోహన్ రెడ్డిని  సర్వీస్ నుండి  పోలీస్ శాఖ  తప్పించింది.  వందలాది మందిని  ఎఎస్ఐ  మోహన్  రెడ్డి  మోసం  చేశారని  కేసు నమోదైన విషయం తెలిసిందే. చిట్టీల పేరుతో  అధిక వసూళ్లకు పాల్పడినట్టుగా మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. కొందరు మోహన్  రెడ్డి బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు.

కరీంనగర్‌ క్రైం బ్రాంచ్ లో ఎఎస్ఐ గా మోహన్ రెడ్డి విదులు నిర్వహించాడు. మోహన్ రెడ్డి నిర్వహించిన  వడ్డీ వ్యాపారంలో  కొందరు పోలీసు ఉన్నతాధికారులకు కూడా పెట్టుబడులున్నాయని  అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.  ఎఎస్ఐ మోహన్ రెడ్డి  వేధింపులు భరించలేక  ప్రసాదరావు అనే  వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాదరావు  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్ రెడ్డి వ్యవహరం బయటకు వచ్చింది. ఈ  కేసు విచారణను సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. దీంతో పలువురు బాధితులు సీఐడీకి  ఫిర్యాదులు చేశారు. మోహన్ రెడ్డికి వందల కోట్ల ఆస్తులున్నట్టుగా  విచారణ బృందం  గుర్తించింది. ఈ  కేసు బయటకు రావడంతో  ఎఎస్ఐగా  ఉన్న మోహన్ రెడ్డిని  సస్పెండ్  చేశారు. మోహన్ రెడ్డిపై స్థానిక పోలీసులతో పాటు సీఐడీ, ఏసీబీ సుమారు  12 కేసులు నమోదు చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu
Viral news: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సర్.. ఇంటర్ ఆన్సర్ షీట్లో విద్యార్థి ఫన్నీ రాతలు, బొమ్మలు