క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు

Published : Mar 23, 2020, 07:52 AM ISTUpdated : Mar 23, 2020, 07:56 AM IST
క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు

సారాంశం

ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా నలుగురు హోం క్వారంటైన్ చేయలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. దేశ ప్రజలంతా ఆదివారం బయటకు రాకుండా జాగ్రత్త  చర్యలు తీసుకున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజు క్వారంటైన్ లో ఉంటే కరోనా అదుపులోకి వచ్చేలా లేదు. దీంతో.. తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.

అయితే.. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా నలుగురు హోం క్వారంటైన్ చేయలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

Also Read ఆదివారం మరో ఆరు... తెలంగాణలో 27కి చేరిన కరోనా కేసులు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖతార్ నుంచి ఇటీవల ఇద్దరు దంపతులు మండలంలోని దాట్ల గ్రామంలో అత్తగారి ఇంటికి వచ్చారు. ఆ దంపతులు, అత్తమామలకు అధికారులు కరోనా అవగాహన కల్పించి, స్వీయ నిర్భందంలో ఉండాలని సూచించారు. అయితే.. వారు అధికారుల సూచనలను పట్టించుకోకపోవడం గమనార్హం.ఇంట్లో నుంచి బటయకు రావొద్దని చెప్పినా విచ్చలవిడిగా తిరిగారు. దీంతో.. పోలీసులు ఆ నలుగురిపై కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారంతో కలిపి ఇప్పటి వరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ మరింత  వ్యాప్తి  చెందకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
    
 

PREV
click me!

Recommended Stories

పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్