తిట్టాడనే కోపంతో... మర్మాంగం కోసేసి..!

Published : Jun 24, 2021, 07:38 AM IST
తిట్టాడనే కోపంతో... మర్మాంగం కోసేసి..!

సారాంశం

 చిల్లర సామాగ్రి అమ్ముకోవడానికి హైదరాబాద్ కి చెందిన రుద్రారపు కార్తీక్... కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి అయిదు రోజుల క్రితం వలసవచ్చాడు.

తనను దూషించాడనే కోపంతో ఓ వ్యక్తి... తన మర్మాంగాన్ని, చెవిని కత్తితో  కోసేవాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తోపుడు బండిపై  చిల్లర సామాగ్రి అమ్ముకోవడానికి హైదరాబాద్ కి చెందిన రుద్రారపు కార్తీక్... కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి అయిదు రోజుల క్రితం వలసవచ్చాడు. స్థానికంగా శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో తాత్కాలికంగా నివసిస్తున్నాడు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం అర్థరాత్రి మద్యం సేవించి.. ఆ మత్తులో కార్తీక్ ను దుర్భాషలాడాడు. దీంతో.. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్... హుస్సేన్ పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు.

ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..
హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే