కాంగ్రెస్ గూటికి మరో మాజీ ఎమ్మెల్యే.... ఫలించిన ఉత్తమ్ వ్యూహం

Published : Sep 08, 2018, 05:14 PM ISTUpdated : Sep 09, 2018, 12:07 PM IST
కాంగ్రెస్ గూటికి మరో మాజీ ఎమ్మెల్యే.... ఫలించిన ఉత్తమ్ వ్యూహం

సారాంశం

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

హైదరాబాద్ శివారు నియోజకవర్గమైన పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ప్రస్తుతం బిజెపి పార్టీలో వున్న అతడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారి నుండి పటాన్ చెరు నియోజకవర్గం పై స్పష్టమైన హామీ రావడంతో కాంగ్రెస్ లో చేరడానికి ఆయన సిద్దమయ్యారు.

దీంతో మరో రెండు రోజుల్లో బిజెపి కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడానికి నందీశ్వర్ గౌడ్ సిద్దమయ్యారు.తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో తన అనుచరులతో కలిసి నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే