పోసాని కృష్ణ మురళిపై జనసేన ఫిర్యాదు: లీగల్ ఓపినియన్ కోరిన పంజాగుట్ట పోలీసులు

By narsimha lodeFirst Published Sep 29, 2021, 2:36 PM IST
Highlights

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై  పంజాగుట్ట పోలీసులు న్యాయ సలహా కోరారు. న్యాయ సలహా తర్వాత ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకొంటామని పోలీసులు తెలిపారు. హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో  పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
 

హైదరాబాద్:సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (posani krishna murali) పై జనసేన  (jana sena) కార్యకర్తలు చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు (panjagutta police) న్యాయ సలహా (legal opinion) కోరారు.న్యాయ సలహా తర్వాత ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకొంటామని పోలీసులు తెలిపారు. హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో  పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ మీడియా సమావేశం ముగించుకొని పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆయనపై దాడికి ప్రయత్నించారు.  పవన్ కళ్యాణ్ తో తనకు ప్రాణ భయం ఉందని  ఆయన చెప్పారు.ఇదిలా ఉంటే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్  పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీసులకు జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదుపై న్యాయ సలహాను కోరారు పంజాగుట్ట పోలీసులు.పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు, మంత్రులు పోసాని కృష్ణమురళి విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ సహా జనసేన నేతలు కూడా స్పందించారు.

click me!