
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం ఏడు రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టాల్సి ఉండగా తొలిరౌండ్ ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
ద్వితీయస్థానం కోసం ప్రొ.కోదండరాం, తీన్మార్ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు సమాచారం. నాలుగు, ఐదు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి మొత్తం 3,86,320 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్లలో 56 వేల ఓట్లలో చెల్లనవి 8,000 కాగా, పరిగణనలోనికి తీసుకున్న 45,000 ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో వున్నారు.