శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ఊపిరాడక స్పృహతప్పిన జనం, ఒకరి మృతి

By Siva KodatiFirst Published Jun 17, 2021, 10:03 PM IST
Highlights

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ తప్పిపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, అధికారులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ తప్పిపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, అధికారులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి మరణించగా... జాకీర్, ఇలియాస్ అనే ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!