సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

Published : Oct 26, 2022, 10:40 AM IST
సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

సారాంశం

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. దూదిబావి బస్తీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ఒకరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. 

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. దూదిబావి బస్తీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ఒకరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక, గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి అక్కడి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో తాము భయాందోళనకు గురైనట్టుగా చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.