తల్లితో.. కొడుకుతో ఒకే యువకుడు అక్రమసంబంధం.. నిలదీసిన తండ్రిని... ప్రియుడితో కలిసి గొంతునులిమి హత్య..(వీడియో)

By AN TeluguFirst Published Oct 12, 2021, 9:31 AM IST
Highlights

రాజు చిన్నప్పటినుంచి homosexual కావడంతో రాజేష్ తో శారీరక సంబంధం పెట్టుకుని తన ఇంటికి తీసుకు వచ్చాడు.  అప్పటి నుంచి రాజు ఇంట్లోనే  రాజేష్ ఉంటున్నాడు.  ఈ క్రమంలో రాజు తల్లితో రాజేష్ కు Extramarital affair ఏర్పడింది.

మల్యాల : భార్యకు కొడుక్కి ఒక్కడే ప్రియుడు. నీచమైన ఆ బంధాన్ని భర్త నిలదీశాడు. దీంతో ఆ ముగ్గురూ కలిసి అతడిని murder చేశారు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మిట్టపెల్లి రాజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో  నివాసముంటున్నాడు.  అతనికి హైదరాబాద్ కు చెందిన జాజు రాజేష్ తో  ఐదు నెలల క్రితం పరిచయం ఏర్పడింది.

"

రాజు చిన్నప్పటినుంచి homosexual కావడంతో రాజేష్ తో శారీరక సంబంధం పెట్టుకుని తన ఇంటికి తీసుకు వచ్చాడు.  అప్పటి నుంచి రాజు ఇంట్లోనే  రాజేష్ ఉంటున్నాడు.  ఈ క్రమంలో రాజు తల్లితో రాజేష్ కు Extramarital affair ఏర్పడింది. అలా ఒకే ఇంట్లో తల్లితో, కొడుకుతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాలు రాజు తండ్రి కృష్ణ (55)కు అనుమానం వచ్చింది. గమనిస్తే విషయం అర్థం అయ్యింది. అది అతన్ని షాక్ కు గురి చేసింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి అన్నాదమ్ములు లైంగిక దాడి...

రాజేష్ మీద మోజు తల్లీ, కొడుకును విచక్షణ కోల్పోయేలా చేసింది. అందుకే తమ సంబంధానికి అడ్డు తగులుతున్న క్రిష్ణను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ముగ్గురూ కలిసి కృష్ణను హత్య చేయడానికి ప్లాన్ చేశారు.  దీంట్లో భాగంగా దైవ దర్శనానికి వెళ్దామని కృష్ణను  నమ్మించి  వేములవాడ రాజన్న దర్శనానికి తీసుకెళ్లారు.  అక్కడి నుంచి ఈ నెల 4న కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లారు.

కొండ పైన ఓ కాటేజీలో ఒక గది అద్దెకు తీసుకున్నారు. రాత్రి పూటుగా మద్యం తాగిన తర్వాత నలుగురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం ముగ్గురు కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ తరువాత కృష్ణ గొంతు నులిమి చంపేసిపరారయ్యారు. విషయం కాటేజీ నిర్వాహకుల ద్వారా తెలిసిన పోలీసులు అరెస్టు చేశారు.  మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

click me!