హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య.. ఆ మార్గంలో నిలిచిన రైలు..

Published : Jan 24, 2023, 03:37 PM IST
హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య.. ఆ మార్గంలో నిలిచిన రైలు..

సారాంశం

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది.

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ రైలు అరగంట పాటు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీంతో మెట్రో సర్వీసుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 

Also Read: హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం.. ఎర్రమంజిల్‌లో రైలు నిలిపివేత.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

ఇక, సోమవారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో వెళ్తున్న ఓ రైలును ఎర్రమంజిల్ స్టేషన్‌లో కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్ల రాకపోకలకు ప్రభావం పడింది. రైలు సర్వీసులు ఆలస్యంగా కొనసాగాయి. ఇదే విషయమై ప్రయాణికులు సోషల్‌మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. సాంకేతిక సమస్యను సరిదిద్దిన తర్వాత వెంటనే కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే