బిర్యానీలో మత్తుమందు కలిపి.. సెంట్రీకి టోకరా.. పక్కా ప్లాన్ తో గ్యాంగ్ స్టర్ పరారీ...

By AN TeluguFirst Published Apr 17, 2021, 2:21 PM IST
Highlights

ఒడిశాలోని కటక్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జహీరాబాద్ రూరల్ పరిధిలోని హత్నూర్ లో చిక్కిన ఘరానా గ్యాంగ్ స్టర్ షేక్ హైదర్ విచారణలో ఆసక్తికరమైన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  

ఒడిశాలోని కటక్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జహీరాబాద్ రూరల్ పరిధిలోని హత్నూర్ లో చిక్కిన ఘరానా గ్యాంగ్ స్టర్ షేక్ హైదర్ విచారణలో ఆసక్తికరమైన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  

తాను తప్పించుకోవడానికి తన ప్రధాన అనుచరుడు యాకూబు సాయం చేసినట్లు అంగీకరించాడు. భువనేశ్వర్, కటక్, పూరీ జిల్లాలో నమోదైన అనేక హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ కేసులో హైదర్ నిందితుడిగా ఉన్నాడు. 

సొంతంగా ఓ ముఠా ఏర్పాటు  చేసుకున్న ఇతడు గ్యాంగ్ స్టర్ అవతారమెత్తాడు. పలుమార్లు పోలీసులు అరెస్ట్ చేసినా తేలిగ్గా బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ప్రత్యర్థి గ్యాంగ్ స్టర్ షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. 

ఈ శిక్ష అనుభవిస్తుండగానే భువనేశ్వర్ కు చెందిన మైన్స్ యజమాని రష్మీరాజన్ మొఘాప్తారా కిడ్నాప్, హత్య కేసులోనూ జీవితఖైదు పడింది. ఈ కేసుల్లో ఏకకాల శిక్ష అనుభవిస్తూ హైదర్ నాలుగేళ్ల క్రితం వరకు భువనేశ్వర్ లోని ఝార్పాడ జైల్లో ఉన్నాడు. 

ఝార్పాడ జైలు నుంచీ దందాలు చేస్తున్నాడని, తప్పించుకోవడానికి పథక రచన చేస్తున్నాడని ఒడిస్సా నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో 2018లో ఇతడిని అధికారులు సబల్ పూర్ జైలుకు మార్చారు. 

కట్టుదిట్టమైన భద్రత మధ్య అనునిత్యం పహారాలో ఉంచారు. తనకు కిడ్నీ సమస్య వచ్చినట్లు ఇటీవల అక్కడి జైలు అధికారులకు చెప్పిన హైదర్ చికిత్స కోసమంటూ మార్చి 23న కటక్ లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు.

అక్కడికి తరచుగా తన అనుచరులు, కుటుంబీకుల్ని విజిటర్స్ గా పిలిపించుకునేవాడు. వీళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సెంట్రీ విధుల్లో ఉండే అధికారులు పట్టించుకోలేదు. కేవలం ఒకే కానిస్టేబుల్ ను సెంట్రీగా ఉంచారు. దీన్ని ఆసరాగా తీసుకున్న హైదర్ తన కుడిభుజం యాకూబ్ లో కలిసి ఎస్కేప్ కు స్కెచ్ వేశాడు. 

నాలుగు రోజుల పాటు క్రమ తప్పకుండా తనను కలవడానికి వస్తూ సెంట్రీ విధుల్లో ఉన్నవారిని మచ్చిక చేసుకోవాలని సూచించాడు. అలా చేస్తూ వచ్చిన యాకూబ్ తరచూ వారికి బిర్యానీ పొట్లాలు తీసుకువచ్చి అందించేవాడు. ఈ నెల 5న మత్తుమందు కలిపిన బిర్యానీని సెంట్రీకి అందించాడు. అతడు మత్తులోకి జారుకోగా.. హైదర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

యాకూబ్ ఏర్పాటు చేసిన స్విప్ట్ (ఓడీ 02 ఏఎస్‌ 6770)వాహనంలో ఒడిస్సా నుంచి ఈ గ్యాంగ్ స్టర్ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించి హైదారాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా తన కారును గుర్తిస్తారని, దాన్ని పెద్ద అంబర్ పేట వద్ద వదిలేసినట్టు హైదర్ బయటపెట్టాడు. 

హైదర్ కు షెల్టర్ ఇచ్చిన హైదరాబాద్ లోని కింగ్ కోఠి, హత్నూర్ లకు చెందిన ఇద్దరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఒడిస్సా పోలీసులు పరిశీలిస్తున్నారు. 
 

click me!