వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవు: వైఎస్ షర్మిల

Published : Mar 25, 2021, 01:47 PM ISTUpdated : Mar 25, 2021, 01:53 PM IST
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవు: వైఎస్ షర్మిల

సారాంశం

 వచ్చే ఎన్నికల్లో తమకు ఎవరితో పొత్తులు ఉండవని వైఎఏస్ షర్మిల ప్రకటించారు.

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తమకు ఎవరితో పొత్తులు ఉండవని వైఎఏస్ షర్మిల ప్రకటించారు.రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో హైద్రాబాద్ లోటస్‌పాండ్ లో ఆమె గురువారం నాడు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్, బీజేపీ చెబితే వచ్చినవాళ్లం కాదన్నారు.ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు చెందిన పోస్టర్, కరపత్రాన్ని ఆమె విడుదల చేశారు.

ఈ సభ నిర్వహణకు ఖమ్మం పోలీసుల  నుండి షర్మిల అనుచరులు అనుమతి తీసుకొన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ సభను నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఈ సభలోనే పార్టీ  పేరును కూడ షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని షర్మిల భావిస్తున్నారు. ఈ సభ గురించి పార్టీ నేతలతో ఆమె చర్చించారు.

కొన్ని రోజులుగా  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై ఆమె చర్చిస్తున్నారు. ఏ రకమైన సమస్యలు ఉన్నాయనే విషయాలపై ఆమె ఆరా తీస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.