నామినేషన్ వేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు.
నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా.. గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన చేత నామినేషన్ వేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు.
నామినేషన్ వేయడానికి గణేష్ గుప్తా వెళ్లే వాహనాన్ని కవిత స్వయంగా నడిపారు. గులాబి రంగులోని అంబాసిడర్ కారు డ్రైవర్ సీటులో కవిత కూర్చొని.. తన పక్క సీట్లో గణేష్ గుప్తాను కూర్చోపెట్టుకున్నారు.
అతని ఇంటి దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ప్రచార రథాన్ని ఆమె నడిపారు. కాగా.. ఆమె అలా వాహనం నడపడాన్ని చూసిన స్థానికులు ఆ చిత్రాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించేందుకు ఎగబడ్డారు.
మీడియా మిత్రులు సైతం.. కవిత వాహనం వెనక వస్తూ.. ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం గణేష్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. కవిత కారు నడిపిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.