ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్: చిట్‌ఫండ్ సంస్థల్లో దేవికా రాణి పెట్టుబడులు

Siva Kodati |  
Published : Dec 16, 2020, 09:16 PM ISTUpdated : Dec 16, 2020, 09:17 PM IST
ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్: చిట్‌ఫండ్ సంస్థల్లో దేవికా రాణి పెట్టుబడులు

సారాంశం

తెలంగాణ ఈఎస్ఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవికారాణికి చెందిన రూ.1.99 కోట్లును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ, తమిళనాడులోని చిట్‌ఫండ్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు దేవికా రాణి ఆమె కుటుంబసభ్యులు. 

తెలంగాణ ఈఎస్ఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవికారాణికి చెందిన రూ.1.99 కోట్లును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ, తమిళనాడులోని చిట్‌ఫండ్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు దేవికా రాణి ఆమె కుటుంబసభ్యులు.  

ప్రతి నెలా చిట్‌ఫండ్ కంపెనీకి లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు చిట్‌ఫండ్ కంపెనీ నుంచి రూ.1.99 కోట్ల డీడీనీ స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే దేవికా రాణి రియల్ ఎస్టేట్ పెట్టుబడులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ ‌లో పెట్టిన రూ.4.47 కోట్లతో పాటు రూ.2.29 కోట్లు డీడీల రూపంలో స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
June Holidays : విద్యార్థులే కాదు ఉద్యోగులూ ఎగిరిగంతేసే మ్యాటర్.. వచ్చేనెల సెలవులే సెలవులు