కూతురి పుట్టినరోజు: 4 రోజుల క్రితమే వరదలో గల్లంతైన తండ్రి, గాలింపు

Published : Oct 16, 2020, 01:33 PM IST
కూతురి పుట్టినరోజు:  4 రోజుల క్రితమే వరదలో గల్లంతైన తండ్రి, గాలింపు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని అమీన్ పూర్ కాజ్ వేపై వరద నీటిలో కారుతో కొట్టుకుపోయిన ఆనంద్ కోసం నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఆయన కోసం గాలింపు చర్యలు  చేపట్టారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని అమీన్ పూర్ కాజ్ వేపై వరద నీటిలో కారుతో కొట్టుకుపోయిన ఆనంద్ కోసం నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఆయన కోసం గాలింపు చర్యలు  చేపట్టారు.

ఈ నెల 13వ తేదీన బీహెచ్ఈఎల్ డిపో నుండి అమీన్‌పూర్ కాజ్‌వే ను దాటే సమయంలో ఆనంద్ అనే వ్యక్తి కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోయాడు. కారు వరద నీటిలో కొట్టుకుపోయే సమయంలో ఆయన తన సోదరుడికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు తన లోకేషన్ ను ఆయన షేర్ చేశాడు. 

also read:హైద్రాబాద్ పాతబస్తీ అలీనగర్‌లో నాలుగు మృతదేహాలు లభ్యం: మరో నలుగురి కోసం గాలింపు

13వ తేదీ నుండి ఆనంద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇంతవరకు ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అమీన్‌పూర్ కాజ్ వే కు దిగువన మత్తడి ఉన్నందున  ఈ ప్రాంతంలో కారుతో పాటు ఆనంద్ ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆనంద్ కోసం గాలింపు చేపట్టాయి. ఆనంద్ కు భార్య, ఓ కూతురు ఉంది. భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి, ఆనంద్ కూతురుది ఇవాళ పుట్టినరోజు.కాజ్ వే వద్ద ఆనంద్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఉన్నారు. రెవిన్యూ తో పాటు పలు శాఖల అధికారులు కాజ్ వే వద్ద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?