కామారెడ్డి రైతునగర్ లో దారుణం: నారాయణ దంపతుల హత్య

Published : Jul 26, 2023, 09:48 AM IST
కామారెడ్డి రైతునగర్ లో దారుణం: నారాయణ దంపతుల హత్య

సారాంశం

కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలో  నారాయణ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు  హత్య చేశారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

కామారెడ్డి: జిల్లాలోని  బీర్కూర్ మండలం రైతు నగర్ లో  కిరాణాషాపు  నిర్వహిస్తున్న  నారాయణ దంపతులను  గుర్తు తెలియని దుండగులు  మంగళవారంనాడు రాత్రి హత్య చేశారు. దోపీడీ దొంగలు ఈ  హత్యకు  పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

నారాయణ  ఇంటి వెనుక వైపు నుండి  ప్రవేశించిన దుండగులు  నారాయణను  కొట్టి చంపారు.  నారాయణ భార్యను ఉరేసి చంపారు.  నారాయణ దంపతులను హత్య చేసింది దొంగలా, ఇతరులా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !