ఈ నెల 14న రాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తాం:అక్బర్‌కి కోర్టు హెచ్చరిక

Published : Sep 01, 2021, 02:52 PM IST
ఈ నెల 14న రాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తాం:అక్బర్‌కి కోర్టు హెచ్చరిక

సారాంశం

ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాఖలైన కేసు విచారణకు ఈ నెల 14న హాజరు కాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. తనపై దాఖలైన పిటిషన్ పై స్టే కోరుతూ అక్బరుద్దీన్ కోర్టును ఆశ్రయించారు. నిర్మల్ లో జరిగిన సభలో హేట్ స్పీచ్ పై ఈ కేసు  నమోదైంది.

హైదరాబాద్: నిర్మల్ హేట్ స్పీచ్ కేసులో ఈ నెల 14వ తేదీన హాజరు కాకపోతే  అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది.నిర్మల్ జిల్లాలో జరిగిన  సభలో అక్బరుద్దీన్ ఓవైసీ  ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆయనపై  గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఈ నెల 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపింది కోర్టు. 

అక్బరుద్దీన్ పై నమోదైన కేసు ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి బదిలీ అయింది.  దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు సమన్లు పంపింది. ఈ విషయమై ఆయన కోర్టులో స్టే  కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 14వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. ఈకేసు విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

2012లో నిర్మల్ లో జరిగిన సభలో హేట్ స్పీచ్ పై అక్బరుద్దీన్ పై కేసు నమోదైంది.ఈ విషయమై  న్యాయవాది కరుణా సాగర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 1న నాంపల్లి ఎంపీ,ఎమ్మెల్యే కోర్టుకు అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కావాలని ఆదేశించింది. లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని  జడ్జి ఉత్తర్వులో పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education
Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్