పార్టీ మార్పుపై వార్తలు .. దుష్ప్రచారం : కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Siva Kodati | Published : Jul 29, 2023 5:43 PM

టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ  గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కాసేపట్లో కీలక ప్రకటన జారీ చేయనున్నారు. 

Google News Follow Us

టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ  గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉత్తమ్ పలుమార్లు మీడియా ముఖంగా ఖండించినా ఈ దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల ఉత్తమ్ తన సతీమణి పద్మావతి, అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లోకి చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. 

Read more Articles on
click me!