హత్యా రాజకీయాలు సహించేది లేదు.. వారికి త‌గిన గుణ‌పాఠం త‌ప్ప‌దు : కేసీఆర్

Published : Nov 01, 2023, 02:40 AM IST
హత్యా రాజకీయాలు సహించేది లేదు.. వారికి త‌గిన గుణ‌పాఠం త‌ప్ప‌దు : కేసీఆర్

సారాంశం

BRS Chief K Chandrashekar Rao: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి అధికార పార్టీ బీఆర్ఎస్ లో  చేరారు. ఈ క్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఇప్పుడు నాగంను కొత్త శక్తిగా కలిగి ఉన్నారని అన్నారు. ఆయ‌న‌ అనుభవజ్ఞుడైన నాయకుడ‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి 14 సీట్లు గెల‌వాల‌నీ, ఆయ‌న సేవ‌లు, స‌హాయం తీసుకోవాల‌ని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ ను వీడిన మ‌రో నేత విష్ణువర్ధన్ ను వెంట తీసుకెళ్లాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను కోరిన‌ట్టు తెలిపారు.

Telangana Assembly Elections 2023: హింసాత్మక దాడులు, హ‌త్య రాజ‌కీయాల‌ను స‌హించేది లేదని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) అన్నారు. త‌మ నాయ‌కుల‌పై దాడి చేసిన వారికి పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని తెలిపారు. తెలంగాణ భవన్‌లో సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్‌రెడ్డి, కరీంనగర్‌కు చెందిన కే జైపాల్‌రెడ్డి స‌హా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్టీ నాయ‌కుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను గురించి ప్ర‌స్తావించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు దుండగులు ప్రయత్నించారనీ, అయితే దేవుడి ఆశీర్వాదంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. హత్యా రాజకీయాలు ఎవరు చేసినా సహించేది లేదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

నాగం జనార్దన్‌రెడ్డి తనకు మిత్రుడని బీఆర్‌ఎస్‌ చీఫ్‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జనార్దన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారని అన్నారు. పార్టీలో చేరాల్సిందిగా ఆయనను కోరాననీ, ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ తెలిపారు. పీజేఆర్ (పీ జనార్దన్ రెడ్డి) కూడా తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు. తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రజల కోసం కూడా పనిచేశార‌ని కొనియాడారు. విష్ణువర్ధన్ రెడ్డి త‌న కుటుంబ సభ్యుడిలాంటివాడ‌నీ, భవిష్యత్తులో గౌరవనీయమైన పదవిని ఇవ్వడం త‌న బాధ్యతగా కేసీఆర్ పేర్కొన్నారు. నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఇప్పుడు నాగంను కొత్త శక్తిగా కలిగి ఉన్నారని అన్నారు. ఆయ‌న‌ అనుభవజ్ఞుడైన నాయకుడ‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి 14 సీట్లు గెల‌వాల‌నీ, ఆయ‌న సేవ‌లు, స‌హాయం తీసుకోవాల‌ని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ ను వీడిన మ‌రో నేత విష్ణువర్ధన్ ను వెంట తీసుకెళ్లాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను కోరిన‌ట్టు తెలిపారు.

తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందనీ, త్వరలో జనార్దన్ రెడ్డిని ఆయన నివాసంలో కలుస్తానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు ప్రతి ఒక్కరి ధ్యేయమనీ, ఆ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం పోరాటంలో పీజేఆర్ చేసిన కృషిని గుర్తించి, ప్రజల కోసం ముఖ్యంగా హైదరాబాద్ సామాన్య ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రముఖ నేత అని కొనియాడారు. పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అంకితభావంతో పనిచేసే వారని, ఆయనతో కలిసి చురుగ్గా పనిచేయాల్సిందిగా ఆహ్వానం పలికారు. పీజేఆర్‌ను వ్యక్తిగత మిత్రుడిగా, విష్ణును కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానని, వారి భవిష్యత్తును ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వారి బాగోగులు, సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu