పాతబస్తీలో మద్యం కోసం.. స్నేహితుడిని చంపిన మరో స్నేహితుడు

Published : Dec 25, 2018, 07:32 AM ISTUpdated : Dec 25, 2018, 07:34 AM IST
పాతబస్తీలో మద్యం కోసం.. స్నేహితుడిని చంపిన మరో స్నేహితుడు

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి అది హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోనీ కాలాపత్తర్ రంజన్ కాలనీకి చెందిన మోసిన్, మహ్మద్ అమేర్ స్నేహితులు. 

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి అది హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోనీ కాలాపత్తర్ రంజన్ కాలనీకి చెందిన మోసిన్, మహ్మద్ అమేర్ స్నేహితులు.

నిన్న రాత్రి ఇద్దరు కలిసి ఓ చోట కూర్చొని పీకల దాకా మద్యం తాగారు. మద్యం మత్తులో, మరింత మద్యం కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అమేర్ తన వద్ద ఉన్న కత్తితో మోసిన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఇది గమనించిన స్థానికులు మోసిన్‌ను ఉస్మానియాకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుడు మహ్మద్ అమేర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu