Congress: బీఆర్‌ఎస్‌ నేతల మోసపూరిత వ్యూహాలకు లొంగిపోవద్దు.. సీతక్క హెచ్చరిక‌లు

Published : Nov 18, 2023, 04:17 AM IST
Congress: బీఆర్‌ఎస్‌ నేతల మోసపూరిత వ్యూహాలకు లొంగిపోవద్దు..  సీతక్క హెచ్చరిక‌లు

సారాంశం

Seethakka: ఉపాధి అవకాశాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు రుణమాఫీ తదితర హామీల‌ను నెర‌వేర్చ‌డంలో 10 ఏళ్లుగా కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని కాంగ్రెస్ నాయ‌కురాలు సీత‌క్క విమ‌ర్శించారు.  

Telangana Assembly Elections 2023: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్)  నాయకుల మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని ములుగు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలుస్తుందని గుర్తు చేశారు. తనకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సీత‌క్క ప్రజలను కోరారు.

ములుగు జిల్లా మంగపేట్ మండల పరిధిలోని చుంచుపల్లి, పాలాయిగూడెం గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో, పేదలకు సహాయం చేయడానికి, వారి భూమి పట్టాల కోసం పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ అంకితభావంతో ఉందని సీత‌క్క‌ ఉద్ఘాటించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడిగే బీఆర్‌ఎస్ నాయకుల మాయ‌లో ప‌డొద్ద‌ని ప్ర‌జలను ఆమె హెచ్చరించారు.

ఉపాధి అవకాశాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు రుణమాఫీ తదితర హామీల‌ను నెర‌వేర్చ‌డంలో 10 ఏళ్లుగా కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని కాంగ్రెస్ నాయ‌కురాలు సీత‌క్క విమ‌ర్శించారు. ప్రభుత్వం మారాలనీ, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రతి ఇంటికి సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు హామీ పథకాలను హైలైట్ చేశారు.

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 6 లక్షల రూపాయలు, ప్లాట్లు లేని వారికి 250 గజాల ఇంటి స్థలం ఉచితంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంపిణీ చేస్తున్నారని గాజర్ల అశోక్ విమర్శించారు. ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారనీ, టీఆర్ ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు నిజంగా పేదలకు మేలు చేశాయా? అని గాజర్ల అశోక్ ప్రశ్నించారు. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలనీ, అణగారిన వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని తాను నమ్మే కాంగ్రెస్ పార్టీకే మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu