రైలు కిందపడి ఎంపీపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రైలు కిందపడి ఎంపీపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం రాజోల్ గ్రామానికి చెందిన ఎంపీపీ కమలాబాయి(40) గురువారం గ్రామ శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
అయితే.. గత కొంతకాలంగా ఆమె మానిసక పరిస్థితి సరిగా లేదు. మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.