పోలింగ్ కేంద్రంలో... కవితకు డబల్ బెడ్రూం సెగ

Published : Apr 12, 2019, 11:39 AM IST
పోలింగ్ కేంద్రంలో... కవితకు డబల్ బెడ్రూం సెగ

సారాంశం

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోలింగ్ కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఆమెను.. కొందరు ఓటర్లు నిలదీశారు.

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోలింగ్ కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఆమెను.. కొందరు ఓటర్లు నిలదీశారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కవిత అక్కడి నుంచి వెనుదిరిగారు.

పూర్తివివరాల్లోకి వెళితే.. తెలంగాణలో శుక్రవారం లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆమె పోలింగ్ సరళిని పరిశీలించేందుకు భోధన్ నియోజకవర్గంలో పర్యటించారు.

కాగా... అక్కడ ఆమెకు నిరసన ఎదురైంది. ఇప్పటి వరకు డబల్ బెడ్రూం ఇళ్లు తమకు ఎందుకు ఇవ్వలేదని కొందరు మహిళలు కవితను నిలదీశారు. కొందరు తమకు పింఛన్లు కూడా రావడం లేదని ఆరోపించారు. కాగా.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కవిత ప్రయత్నించినప్పటికీ.. వారు వినిపించుకునేలా కనిపించలేదు.

దీంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత మరికొన్ని పోలింగ్ స్టేషన్లను ఆమె పరిశీలించారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !